Chitram news
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 3:48 pm Editor : Chitram news

డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ 

డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మమ్మాయి రమేష్ ను ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ శాలువా కప్పి సన్మానించారు.పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు పటేల్,మాట్లాడుతూ. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మమ్మాయి రమేష్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించిందని, భవిష్యత్తులో జిల్లా స్థాయిలో పార్టీ మరింత పటిష్టం కావడానికి రమేష్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

​తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు ఘనంగా సన్మానించినందుకు మమ్మాయి రమేష్ మా జీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటానని, పార్టీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మమ్మాయి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.