Chitram news
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 8:53 pm Editor : Chitram news

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఇమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రోచ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై సహకారంతో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలొ ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా హీమోఫిలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్:గంగారం మరియు ఇన్నమురీ రవితేజ,డాక్టర్:రఘు, డాక్టర్:సంతోష్ దంత వైద్యులు డాక్టర్: జగదీష్ ఫిజియోథెరపిస్ట్ , స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య హిమఫిలియా సొసైటీ అధ్యక్షులు దాసరి విజయనందరావు లు పాల్గొని హిమోఫిలియా వ్యాధి గురించి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. అయితే హిమోఫిలియా వ్యాధి అనేది ఒక రాజవంశపు వ్యాధిగా పేర్కొంటారన్నారు. కొందరికి జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. ఇది అన్ని వ్యాధుల మాదిరిగానే ఈ వ్యాధి కూడా ఒకటని సూచించారు. అయితే ఏ వ్యాధికైనా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చు అన్నారు.అలాగే వ్యాధి వచ్చిందని మానసిక కుంగుబాటుకు గురైనట్లయితే శారీరక దృఢత్వం కోల్పోవడం జరుగుతుందని దాంతోపాటు అనారోగ్యం బారిన మరింత ఎక్కువ పడతారని సూచించారు.మీరు ఎప్పుడైతే మానసిక దృఢత్వంతో ఉంటారో వ్యాధిని అధిగమించవచ్చని హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు మరియు వారి తల్లిదండ్రుల్లో మానసిక ధైర్యాన్ని నింపారు.అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అలాగే దంత వైద్య నిపుణులు మాట్లాడుతూ హిమోఫిలియా బారిన పడ్డవారు దంతాలు, చిగురుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా బ్రష్ చేయాలి. ఎప్పుడు రక్తస్రావం జరుగుతుంది అలా జరగకుండా ఎలా ఉండాలని క్లుప్తంగా వివరించారు.అలాగే ఫిజియోథెరపీ వైద్యుడు జగదీష్ మాట్లాడుతూ.. దినచర్యలో భాగంగా వ్యాయామం ఏ విధంగా చేయాలి ఆటలు ఏ విధంగా ఆడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన వైద్యులను హిమోఫిలియా సొసైటీ చాప్టర్ నిజామాబాద్ అధ్యక్షులు దాసరి విజయ్ నంద రావు మరియు చాప్టర్ సభ్యులు అంబరీష్, యజాస్ హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శాలువలు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.