జైనథ్ లో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరస
చిత్రం న్యూస్, జైనథ్: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ జైనథ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా సాధికారతకు కీలకమైన మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని వారు విమర్శించారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ధి కోసం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో జైనత్ బీజేపీ మండల అధ్యక్షుడులోక కరుణాకర్ రెడ్డి, బోరాజ్ మండల బీజేపి అధ్యకుడు గాజుల సన్నీ, స్థానిక బీజేపీ నాయకులు, చిలుకూరి లింగారెడ్డి, పిడుగు సంతోష్ యాదవ్, పొచ్చన్న,సురేష్ తదితరులు పాల్గొన్నారు.