నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఫ్లోరోసెంట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్ లతో నిజామా బాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్, నిజామా బాద్,ఆర్మూర్ డివిజన్ పరిధిలోగల 55 బ్లాక్ స్పాట్లను పోలీసులు సమగ్రంగా గుర్తించి పర్యవేక్షించారు.ఎస్ఐలు,సీఐలు, ఏసీపీలు,అదనపు డీసీపీ(అడ్మిన్)తో పాటు పోలీస్ కమిషనర్ స్వయంగా ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్,...