ఈ నెల 18న కూర గ్రామంలో హిందూ సమ్మేళనం
చిత్రం న్యూస్, జైనథ్: ఆధ్యాత్మికత, ఐక్యతను చాటిచెప్పే లక్ష్యంతో శనివారం ఉదయం 11 గంటల నుండి కూర గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వేదికగా భారీ “హిందూ సమ్మేళనం” నిర్వహించనున్నారు. కరంజి ఉప మండలం పరిధిలోని అనంద్ పూర్, కూర, కరంజి, కాప్రి, ఉమ్రి వంటి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ధర్మ పరిరక్షణ, హిందూ సమాజంలో ఐక్యత పెంపొందించడం కోసం ఈ సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, సామూహిక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు తెలిపారు.