Chitram news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 4:41 pm Editor : Chitram news

ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో నీటి కోసం గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు గ్రామంలో నీటి కష్టాలు మొదలవుతాయి. మిషన్ భగీరథ ఉన్న గ్రామానికి కావాల్సినంతగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో 3 కిలోమీటర్ల దూరంలోని మంగ్రూడ్ గ్రామ శివారులో ప్రభుత్వ స్థలంలో బోరు వేసి అక్కడి నుండి పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ ట్యాంక్ కి సరఫరా చేసి నీటిని వినియోగించుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ ఉన్న బోర్ స్టార్టర్ ని ధ్వంసం చేశారు.రెండు రోజుల నుండి నీటి కోసం గ్రామస్థులు అనేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. ఈ సందర్బంగా గ్రామ ఉప సర్పంచ్ కాడే సంజయ్ మాట్లాడుతూ…కొందరు వ్యక్తులు కావాలనే ఉద్దేశ్యంతో అక్కడ ఉన్న బోర్ స్టార్టర్ ని పలుమార్లు ధ్వంసం చేశారన్నారు . మరోమారు ఇలానే ప్రవర్తిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.