Chitram news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:56 pm Editor : Chitram news

బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం  

బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం  

*కంటతడి పెట్టుకున్న రైతు గోసుల రాజు 

చిత్రం న్యూస్, బాసర : ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట కళ్ళముందే దగ్ధం అయిన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బాసరలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన గోసుల రాజు రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. చేనులో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి తిని వచ్చేలోపు పంటకు నిప్పంటుకొని కాలి బూడిదవడంతో  కన్నీరు మున్నీరయ్యాడు. గమనించిన తోటి రైతులు బకెట్లతో నీరు పోసి కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట బూడిద కావడంతో బాధిత రైతు కంటతడి పెట్టుకున్నాడు. పంటకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.