బాసర ఆలయంలో భక్తుల సందడి
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకోవడానికి వరుసలో బారులు తీరారు. బారులు తీరిన భక్తులకు ఆలయ ఈవో విజయరామారావు, మంచినీళ్లు, మజ్జిగ, వసతులు కల్పించారు. శుక్రవారం కావడంతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలను చేయించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఈవో విజయ రామారావు, ఏవో గంగ ప్రసాద్, బాసర సీఐ కిరణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.