చిత్రం న్యూస్,బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చెంపల్లి గ్రామానికి చెందిన యోగిత 108 వాహనంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బేల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొని వెళ్లారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి 108 అంబులెన్స్ లో అదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యల నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటీ సాయి కిరణ్ ,పైలట్ అర్షద్ ఖాన్ లు వాహనం నిలిపి ప్రసవం చేశారు. మహిళ మగ బిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించిన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.