నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నేస్తం ఫౌండేషన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల హక్కుల కోసం జరిగిన పోరాటానికి నిదర్శనమని కొనియాడారు. “బోధించు, సమీకరించు, పోరాడు” అనే నినాదంతో సమాజంలో చైతన్యం నింపిన మహనీయుడని ఆయన సేవలను స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు వంశీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరెళ్ల దినేష్, అఖిల్, సాయి, నాని, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.