Chitram news
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 10:28 pm Editor : Chitram news

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత

*నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజంలో అనాధ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత అని, వారిని ఆదుకోవడం ద్వారా మనుష్యత్వాన్ని చాటుకోవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ లో గల నిర్మల్ భవన్ లో అనాధ వృద్ధాశ్రమాన్ని సోమవారం సీపీ సందర్శించారు. అక్కడ నివసిస్తున్న అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి ఆరోగ్యం, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న సహాయం కూడా వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, అందరూ సేవాభావంతో ముందుకు రావాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ చార్జి ఏసీబీ రాజా వెంకటరెడ్డి టాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సౌత్ రూరల్ సీఐ సతీష్ కుమార్, టాఫిక్ సీఐ ప్రసాద్, టాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్, టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్, గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి, నిర్మల్ భవన్ సిస్టర్ రోసుమ్మ, గామ ప్రజలు పాల్గొన్నారు.