అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఏసీబీ నూతన కార్యాలయాన్ని సోమవారం సీపీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీబీ కి ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయాలని సూచించారు. ఈ పారంబోత్సవానికి హైదరాబాద్ ఏసీబీ వెస్ట్ జోన్ డిప్యూటి డైరెక్టర్ డి. కమలాకర రెడ్డ్ని నిజామాబాద్ ఏసీబీ డీస్పీ జి.శేకర్ గౌడ్, ఇన్స్ పెక్టర్స్ యం.వేణుకుమార్, జి.నగేష్, ఏసీబీ సిబ్బంది హాజరయ్యారు.