పేదింటి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్థులు
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం మాలెబోరిగామ గ్రామ పంచాయతీ లోని కె బి కాలనీ గ్రామస్థులు. గ్రామానికి చెందిన మెస్రం రజిత వివాహం నిమిత్తం తమవంతు సాయంగా రూ.12,500 నగదును సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.మానవత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో గ్రామంలో కట్నకానుకలు, ఆర్భాటాలను నిషేధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మెస్రం నాగోరావ్, గ్రామ మహజన్ సెడ్మకి అనంద్ రావ్, గ్రామ దేవారీ మెస్రం గణపతి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.