Chitram news
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 9:16 pm Editor : Chitram news

నిఘా నేత్రం..నేర నియంత్రణకు మార్గం

ఇచ్చోడలో 40 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల అదుపులో సీసీటీవీ కెమెరాలు ‘మూడో కన్ను’గా నిరంతరాయంగా పని చేస్తాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గంజాయి వినియోగానికి, విక్రయాలకు దూరంగా ఉంటూ “నో టు గంజాయి” నినాదాన్ని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు  సిబ్బంది పాల్గొన్నారు.