Chitram news
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 7:40 pm Editor : Chitram news

హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

చిత్రం న్యూస్, బేల: మండలంలోని బాధి గ్రామపంచాయతీ పరిధిలోని హేటి గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. గ్రామ పటేల్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంతేలా వినోద్, వార్డు సభ్యులు జోడే గణేష్, కనకే జ్ఞానేశ్వర్ మరియు గ్రామ పెద్దలు దాసరి గుణవంతరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సంజయ్ గుండవార్, వాంఖడే వామన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.