ముథోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా ముథోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (ప్రెస్ క్లబ్) విలేకరులు అందరూ సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జింద్లే సునీల్, ఉపాధ్యక్షులుగా సొన్కాంబ్లే రాహుల్, మల్లేష్ , ప్రధాన కార్యదర్శిగా ముఫ్తీ రాయిస్ ఖాస్ మి , కోశాధికారిగా దొంతుల్వార్ రమేష్, సంయుక్త కార్యదర్శిగా శరత్ గైక్వాడ్ లను ఎన్నుకున్నారు, సభ్యులు దుర్గాప్రసాద్, మురళిగౌడ్, తిరుపతి గౌడ్, విజయ్, పి.నాగేష్, నాగేష్, పవన్, బషీర్, అజీమ్, సుభాష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.