Chitram news
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 10:17 pm Editor : Chitram news

పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నగరంలో సెల్​ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు వాటిని ట్రేస్ చేసి తిరిగి అందజేసినట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్​హెచ్​వో మాట్లాడుతూ.. వన్​ టౌన్​ పరిధిలో 20మంది బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఈఐఆర్​ పోర్టల్ ద్వారా వాటిని ట్రేస్​ చేసి తిరిగి బాధితులకు శనివారం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్​ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని.. ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.