-Advertisement-

డీసీసీ కార్యాలయంలో ఘనంగా ఫులే జయంతి: పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహనీయులు, గొప్ప సంఘసంస్కర్త, మహాత్మా జ్యోతిరావు ఫులే అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఫులే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం కృషి చేసిన ఆ మహనీయుడు మనకు ఎప్పటికీ ఆదర్శమన్నారు. సమాజంలో సమానత్వం, అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన జ్యోతిరావు ఫులే ఆశయాలు ఆదర్శంగా తీసుకొని మనమంతా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జ్యోతిబా ఫులే దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ.. నినాదాలు చేస్తూ వారిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బెజ్జంకి అనిల్ , గౌలి సంజయ్, మంగేష్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments