చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లోని అశోక బుద్ధ విహార్ లో మే 1న నిర్వహించే బౌద్ధ పూర్ణిమ ( వైశాఖ పూర్ణిమ ), డా.బీ. ఆర్ అంబేద్కర్ జయంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పిలుపునిచ్చారు.ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గం ట్రస్ట్ కార్యాలయంలో జయంతులకు సంబంధించిన గోడ ప్రతులను దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పలువురు తో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జయంతులకు వేలాది సంఖ్యలో బౌద్ధ ఉపాసకులు, అంబేద్కర్ వాదులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ కార్యక్రమం నిర్వాహకులకు రూ.10 వేల చెక్కును డా. బీ.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ బుద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞా కుమార్ , జిల్లా అధ్యక్షులు విట్టల్ బుట్టే , ప్రధాన కార్యదర్శి దయానంద్ పొటఫోడే , డా. బీ .ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భీమ్ రావు వాగ్మారే , జిల్లా జనరల్ సెక్రటరీ దడసాహెబ్ జబడే తో పాటు దయానంద్ కామ్లే , కాంతారావు వాగ్మారే , రంగారావు వాటోరే , గోవింద్. రఘనాథ్ ఆడే. రమేష్ తదితరులు పాల్గొన్నారు.


