చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం గోదావరి నది పుణ్య స్నానాలకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను గంగపుత్రులు కాపాడారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడ ఉన్న గంగ పుత్రులు డప్పు నరేశ్ గమనించి ఇద్దరిని గోదారోడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు. వారిని కాపాడినందుకు నరేష్ కు పలవరు అభినందనలు తెలిపారు.