Chitram news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 10:11 pm Editor : Chitram news

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యోగా, మెడిటేషన్ పై అవగాహన

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యోగ డే, హోమియోపతి డే ఆరోగ్య దినోత్సవాల ను పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు,  పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగ మ మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా ఆయుష్ విభాగాధికారి డాక్టర్ గంగాదాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మన ఇంట్లో వంట గదిలో దొరికే దినుసుల ద్వారా ఆరోగ్యం అన్నారు. అదేవిధంగా ఔషధ మొక్కలపై అవగాహన పెంచుకొని మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని వాటిని మనకు అవసరాన్ని కనుగొనంగా ఆయుర్వేద వైద్య నిపుణులచేత సూచనలు తీసుకుంటూ ఔషధాలుగా ఉపయోగించవచ్చన్నారు. ఆయుర్వేద యునాని, హోమియోపతి మందులు జిల్లా ప్రజలకు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ఎటువంటి సందేహం లేకుండా డాక్టర్ల సూచన మేరకు ఉపయోగించవచ్చు అన్నారు.మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రశాంతమైన మనసుతో ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగించవచ్చన్నారు. ప్రతిరోజు మెడిటేషన్ క్రమం తప్పకుండా చేయడం జీవనశైలిలో మార్పును తీసుకురావచ్చన్నారు. యోగ డాక్టర్ తిరుపతి,  విజయభాస్కర్ తో కలిసి నర్సింగ్ కళాశాల విద్యార్థి నీలచైత యోగ ఆసనాలపై , మెడిటేషన్ పై సాధారణ వ్యాధులపై,అవగాహన కలిగించారు.  ఈ కార్యక్రమంలో పీడియాట్రిషన్ డాక్టర్ శ్రీకాంత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ సూపరిండెంట్ చంద్రకళ, విజయలక్ష్మి,మాక్లూర్ నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు, పురుషోత్తం, రమేష్,ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.