విద్యుత్ సరఫరాలో అంతరాయం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ నిజామాబాద్ టౌన్ 2 ఏడీఈ ప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఆయన కోరారు.