చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధి డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామ పంచాయతీ లో చెత్త సేకరణ నిమిత్తం రూ.10 లక్షల తో నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవి కిరణ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వాసు బాబు లతో కలిసి వాహనాన్ని ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉంటారని ఆ దిశగా గ్రామ పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షేక్ ఖాదర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


