చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ లను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్ లను సద్వినియోగపర్చుకోవాలన్నారు. అంగన్వాడీ నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు డిజిటల్ వ్యవస్థలో పొందుపరుస్తూ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అంగన్వాడీ నిర్వాహకులు పిల్లలకు, గర్భిణులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చాలన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో 326 సెల్ ఫోన్లను అంగ న్వాడీ నిర్వాహకులకు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలిక సమస్యలను అంగన్వాడీ టీచర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు చంద్రకళ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
