-Advertisement-

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

 ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం శాంతినగర్‌లోని ఈవీఎం గోదామును సందర్శించారు. అక్కడ భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ (VVPAT) యంత్రాల పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గోదాము వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, రిజిస్టర్ల నిర్వహణను ఆయన తనిఖీ చేశారు. యంత్రాల నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, రెవెన్యూ సిబ్బంది సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments