చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మధుప్రీతి
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె )గ్రామ సర్పంచ్ మధుప్రీతి, సురేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి,అధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు, గ్రామస్తులకు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామస్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ప్రారంభించామని సర్పంచ్ మధుప్రీతి తెలిపారు. ఈ కార్యక్రమంలో. ఉప సర్పంచ్ కో ప్లే నాగనాథ్ , బీజేపీ కార్యకర్త సిందే వినయ్ రావు పటేల్, కధం సాయినాథ్ పటేల్, కర్రోల్ల మల్లయ్య, పెద్ద కప్ సక్కరి, అగ్గోళ్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.


