Chitram news
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 10:37 pm Editor : Chitram news

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి

రూ.5.60 లక్షల ఎల్.ఓ.సి లెటర్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన ఎర్గు సత్యవ్వ అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5 లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను అదేవిధంగా నిజమాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్ చికిత్స నిమిత్తం రూ .60 వేల విలువగల ఎల్.ఓసి లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు వారి గ్రామస్తులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.