డీసీసీ కార్యాలయంలో ఘనంగా రాంజీ గోండ్ వర్ధంతి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో : ఆదివాసీ వీరుడు మర్సుకోల రాంజీ గోండ్ వర్ధంతి సందర్భంగ జిల్లా కాంగ్రెస్ కమిటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో రాంజీ గోండ్ చేసిన త్యాగాలు అపారమని పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, ఆయన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన రాంజీ గోండ్ చరిత్రను యువత తెలుసుకోవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి,మందగూడ సర్పంచ్ గోపాల్,రప్ అహ్మద్,కనక నాగోరావ్, హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాంజీ గోండ్ సేవలను స్మరించుకున్నారు.

