Chitram news
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 3:30 pm Editor : Chitram news

జర్నలిస్టులను సన్మానించిన ఆలయ ఈవో  విజయరామారావు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి, వాటి చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా,పత్రికలు, ఛానళ్లు,సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకం, అభినందనీయమని ఆలయ ఈవో విజయరామారావు అన్నారు. ఆలయాల విశిష్టతను చాటిచెప్పడం ద్వారా భక్తులను చైతన్యపరచడంలో మీడియా సేవలందిస్తోందన్నారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆశీర్వాద మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సాయిలు, పి ఆర్ ఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.