-Advertisement-

నేరాల నియంత్రణకు కఠిన చర్యలు: సీపీ అంబర్ కిషోర్ ఝా

చిత్రం న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల సమీక్ష, దర్యాప్తు వేగవంతం, సాంకేతికత వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెండింగ్ కేసుల పరిష్కారం, కొత్త కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, వారెంట్ల అమలు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. దర్యాప్తులో జాప్యంపై ఆరా తీసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి న్యాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, రికవరీ శాతాన్ని పెంచాలని సీపీ సూచించారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని, నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, ప్రజల భాగస్వామ్యంతో వీటిని విస్తరించాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖల సహకారంతో నివారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి “అరైవ్-అలైవ్” కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులపై సత్వర స్పందన ఇవ్వాలని ఆదేశించారు.గంజాయి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments