అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసిన పోలీసులు
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో (ముధోల్ ) :మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని ముథోల్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి తానూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముందస్తు సమాచారం అందిన నేపథ్యంలో ఎస్సై షేక్ జుబేర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా, సదరు లారీలో ఎటువంటి రవాణా అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత, పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన తదుపరి విచారణ చర్యల కోసం వాహనాన్ని తహసీల్దార్ కు అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్సై జుబేర్ మాట్లాడుతూ, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం ఛారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇసుక ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎవరికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు
