చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : కుంటాల మండలం, వెంకూరు గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన భవనం గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.భవన ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ సవిత బాజీరావు, ఉప సర్పంచ్ అశోక్ అధ్యక్షత వహించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జి.వి. రమణారావు, దిగంబర్ పాటిల్, అప్క గజ్జారాం, జక్కుల గజేందర్, వెంగళరావు, మగ్గిడి దిగంబర్, గంగాధర్, ఎస్. సాయినాథ్, పి. సాయినాథ్ వంటి స్థానిక నాయకులు, అలాగే తహసీల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ పాల్గొన్నారు.
-Advertisement-
వెంకూరులో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
RELATED ARTICLES

