-Advertisement-

వెంకూరులో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : కుంటాల మండలం, వెంకూరు గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన  గ్రామపంచాయతీ  నూతన భవనాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన భవనం గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.భవన ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ సవిత బాజీరావు, ఉప సర్పంచ్ అశోక్ అధ్యక్షత వహించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జి.వి. రమణారావు, దిగంబర్ పాటిల్, అప్క గజ్జారాం, జక్కుల గజేందర్, వెంగళరావు, మగ్గిడి దిగంబర్, గంగాధర్, ఎస్. సాయినాథ్, పి. సాయినాథ్ వంటి స్థానిక నాయకులు, అలాగే తహసీల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments