-Advertisement-

నష్ట పోయిన రైతులకు తక్షణమే పరిహారం అందజేయాలి,: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి డిమాండ్ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల లో ఇటీవల కురిసిన అధిక వడగళ్ల వాన కారణంగా రైతుల పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ముఖ్యంగా సాగులో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే అప్పుల బారిన పడిన రైతులు ఈ అనుకోని ప్రకృతి విపత్తు తో మరింత కష్టాల్లోకి నెట్టబడ్డారు. ఈ నేపథ్యంలో, నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరుతూ మంగళవారం నిజామాబాద్ లో జిల్లా కలెక్టర్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి(ఎంపిఆర్)మాట్లాడుతూ..ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదు ర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే, పంట నష్టం జరిగిన రైతులకు సరైన పరిహారం అందించకపోతే బీజేపీ పార్టీ రైతుల పక్షాన బలమైన ఉద్యమాన్ని చేపడుతుందని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు గంగాధర్, సరిన్, ఇంద్రకరణ్,జిల్లా ఉపా అధ్యక్షులు కందగట్ల రాంచందర్, సీనియర్నా నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు,పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments