-Advertisement-

ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..పోలీస్ సిబ్బంది 24/7 విధులు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని అందుకోసం డాక్టర్ ల సూచనలు పాటించాలాన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యనికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో వివిధ రకాల ఫ్రూట్స్ నుండి అన్ని రకాల జాగ్రతలు తీసుకొని వాటిని వాడాలని తెలిపారు. మన శరీరమునకు ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని, జీర్ణం కాని ఆహారము తీసుకొని బాధపడకూడదని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని, డాక్టర్ల సూచనలు, సలహాలు తప్పనిసరి పాటించాలని కోరారు. ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం ఎంతో శోభదాయకమని భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేకం నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జి.బస్వారెడ్డి , నిజామాబాద్ నగర మేయర్ కే.ఉమారాణి రమేష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్,  ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ పురంధాల, ఐఎంఏ జనరల్ సెక్రెటరీ డా. వి.అశోక్, నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈ. రవీందర్ రెడ్డి, ఐఎమ్ఏ  అధ్యక్షులు డాక్టర్ విశాల్ , మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్.నరసింహ కట్ట,( నరాలు, బ్రెయిన్ స్పెషలిస్ట్) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments