Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 8:18 pm Editor : Chitram news

రాజురా వీడీసీ నూతన కమిటీ ఎన్నిక

  1. చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (వీడీసీ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సుందరగిరి ముత్తా గౌడ్, ఉపాధ్యక్షుడిగా నర్సింగ్ రావు ఎన్నికయ్యారు. కోశాధికారిగా జిలకర సాయి ప్రసాద్, జాయింట్ కోశాధికారిగా తమ్మరాశి గంగాధర్, రైటర్‌గా టీకే శ్రీనివాస్ ఎంపికయ్యారు. వీరు కమిటీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించనున్నారు. నల్లల రాజు చైర్మన్‌గా వైస్ చైర్మన్‌గా ముజాహిద్ ఎన్నికయ్యారు.గ్రామస్తులు, ప్రముఖులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.