చిత్రం న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో ( జన్నారం): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన పూసం కుటుంబ వివాహ వేడుకకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించిన సుగుణ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, వివాహ వేడుకలో పాల్గొన్న బంధుమిత్రులతో కాసేపు గడిపారు. స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-Advertisement-
పూసం కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న ఆత్రం సుగుణ
RELATED ARTICLES

