చిత్రం న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో ( సిర్పూర్ (టి) ): మండల కేంద్రంలోని సీడీపీఓ ఆఫీసు ప్రాంగణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, పిల్లలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్ల, ఆయాల గౌరవ వేతనం పెంచాలని తాను అసెంబ్లీలో డిమాండ్ చేశానని, ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపడుతుందని తెలిపారు.విపరీతమైన పని ఒత్తిడితో సతమతం అవుతున్న అంగన్వాడీ టీచర్లకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపిఓ విజయలక్ష్మి, సూపర్ వైజర్ పద్మ, ఎమ్మార్వో రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, సర్పంచ్లు ఒడ్డేటి నాగమణి నానయ్య, లావణ్య, ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, అన్ని మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, నాయకులు రాచర్ల మహేష్, రాజశేఖర్, జాగరి రమేష్, శేఖర్, శ్యామ్ రావు, సంతోష్, బాలాజీ, బాబు, మహేష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
