Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 7:20 pm Editor : Chitram news

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో వరల్డ్ మెడికల్ డే సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ర్యాలీ, ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి పరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, తెలంగాణ స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్ వైద్యులు కిషన్ పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

అనంతరం పరేడ్ గ్రౌండ్ లో మున్సిపల్ ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పలువురు వైద్యులు సేవలందించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ముఖ్య అతిథులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.