చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో ( వాంకిడి ) : కళ్యాణ లక్ష్మీ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం వెంకట తహసీల్దార్ కార్యాలయంలో సర్పంచ్ చుర్కకార్ సతీష్, మాజీ జడ్పీటీసీ అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ బండే తుకారం లతో కలిసి 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తుందని, అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
-Advertisement-

