Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 10:36 am Editor : Chitram news

ఎమ్మెల్యేను సన్మానించిన బాసర ఆలయ పూజరులు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కృషి అమోఘమని, ఆయన సేవలు నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆలయ పూజరులు, గ్రామస్తులు అన్నారు. మంగళవారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి భూమి పూజ చేయడం ఏంతో lసంతోషాన్ని కలిగించిందన్నారు. తన మనవడికి ఇక్కడే అక్షరాభ్యాసం చేయించి,, పెద్ద మొత్తం లో ఒకే సారి నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు మార్లు అసెంబ్లీలో బాసర సమస్యపై మాట్లాడటం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ పూజరులు, బీజేపీ కార్యకర్తలు పుట్నాల సాయినాథ్, సిహెచ్ సాయినాథ్, పోగుల రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.