Chitram news
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 8:07 pm Editor : Chitram news

ఆరోగ్య వారంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారం నిర్వహించడం జరుగుతుందని, ఈ ఆరోగ్య వారాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ దిలీప్ అధ్యక్షతన వారి చాంబర్లో నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్: బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారంలో అన్ని ఆరోగ్య దినోత్సవాలను జిల్లా అధికారుల సమన్వయoతో విజయవంతం చేయాలన్నారు.

ఈ సందర్భంగా డా.రాజశ్రీ మాట్లాడుతూ. ఏప్రిల్  6న  సోమవారం మొదటి రోజు ఫుడ్ సేఫ్టీ డే నీ నిర్వహించడం జరిగిందన్నారు. ఆహార భద్రతపై అవగాహన, ర్యాలీ  చేపట్టామన్నారు. ఉద్యోగులకు జీవన శైలి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ రోజు 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబ్బా పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద అవగాహన ర్యాలీ, అవగాహన సదస్సు,.  8న సేఫ్ మదర్రో రోజును నిర్వహించడం జరుగుతుందని ఆరోజు జిల్లా స్థాయి లో గర్భిణీ స్త్రీలు బాలింతలకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు మాతా శిశు మరణాలను తగ్గించడంపై అవగాహన కలిగించడం జరుగుతుంది అన్నారు. న 9న హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ,  నిర్ధారణ పరీక్షలను కేంద్రకారాగారంలోని ఖైదీలకు, ట్రాన్స్ జెండర్ లకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 10న హోమియోపతి, ఆయుర్వేద దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆరోజు కోటగల్లి పద్మశాలి సంఘంలో యోగ పై అవగాహన, హోమియోపతి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెన్తెనింగ్ రోజుగా నిర్వహించడం జరుగుతుందని డ్రగ్స్ క్వాలిటీ ,అవైలబిలిటీ, రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఆఫ్ మెడిసిన్స్ పై అవగాహన ఉంటుందని అన్నారు.