చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసరలోని పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో విజయ రామారావు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి , దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ . ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడు రియాన్స్ కు అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అక్షరాభ్యాసం చేయించారు.
