-Advertisement-

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోనోత్సవం: గ్రామ గ్రామాన ఎగిరిన కాషాయ జెండా

చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా జైనథ్, మాకోడ, సాంగ్వి (కె), కరంజి (కె) గ్రామాల్లో నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు

జైనథ్ మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు చిల్కూరి లింగారెడ్డి, వార్డు సభ్యులు లక్కం అనిల్, కోడిచర్ల స్వామి, చౌదరి పరశురాం, శాలిక్ రావ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మాకోడ గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, సోంరెడ్డి ఉషన్న, మచ్చ సంతోష్, బీజేపి జైనథ్ మండల మహిళ మోర్చ అధ్యక్షురాలు దివ్ పలువురు బీజేపి నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సవంగా జరిపారు.

కరంజి (కె) గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. బూత్ నూతన అధ్యక్షులు సామ నర్సింగ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, పోచ్చన్న , సూర్య, మహేందర్ రెడ్డి, సచిన్ తదితరుల పాల్గొన్నారు.

సాంగ్వి (కె) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాంగ్వి గ్రామంలో బిజెపి నాయకులు పోచ్చిరాం, తరుణ్ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments