Chitram news
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 8:42 am Editor : Chitram news

దీపాయిగూడలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: జెండా ఆవిష్కరించిన లోక కరుణాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జైనథ్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని దీపాయిగూడ గ్రామంలో బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి తన స్వగ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించడం వెనుక లక్షలాది మంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.