చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, అదనపు డీసీపీ (సి.ఏ.ఆర్) కె. రామ్ చందర్ రావ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ లు మాట్లాడుతూ 1908 ఏప్రిల్ 5న బీహార్ లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జగజ్జీవన్ రామ్ చిన్నప్పటి నుండే కుల వివక్షను, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు . విద్య ద్వారానే మార్పు సాధ్యమని , అంటరానితనాన్ని నిర్మూలించడానికి అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించడానికి ఆయన 1935లో అఖిలభారత అనగారిన వర్గాల లీగ్ ను స్థాపించారన్నారు. ఒక దేశంలోని బలహీన పౌరులకు సాధికారత కల్పించే వరకు ఆ దేశం నిజంగా స్వేచ్ఛగా ఉండలేదని ఆయన విశ్వసించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ జీవితం దేశానికి ఒక అనిర్వచనీయమమైన స్తంభంగా నిలిచిందాన్నారు.భారత రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఉప ప్రధానిగా ఆయన పరిపాలన నైపుణ్యం, భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడిందన్నారు. హరిత విప్లవంలో వ్యవసాయ మంత్రిగా ఆయన పోషించిన పాత్ర దేశ సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి అని , నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దంల నిలిచిన ఆయన జీవితం మనందరికీ స్ఫూరిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ (వెల్ఫేర్, హోంగార్స్), రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ ( ట్రాఫిక్ ), స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు సంతోష్ రెడ్డి , సాయన్న , సిసిఅర్బీ ఎస్ఐలు శివరాం, విజయ్ కుమార్, పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
