Chitram news
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 10:36 am Editor : Chitram news

నిర్మల్‌లో లో పీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం 

చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ ల పర్యటన సందర్భంగా భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీతో పట్టణం మార్మోగింది. నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గణనీయమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ పర్యటన సందర్భంగా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాయకులకు తమ మద్దతును తెలిపారు. అనంతరం, భారీ బైక్ ర్యాలీని నిర్వహించి, సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడం ద్వారా నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలం స్పష్టంగా కనిపించిందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ ల పర్యటన, పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్తేజాన్ని నింపింది.