Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 10:54 pm Editor : Chitram news

ప్రజా సంక్షేమమే మా ధ్యేయం: మేయర్ ఉమారాణి రమేష్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ శనివారం ఆలీ సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. నీటి మట్టాలు, నిల్వ సామర్థ్యం, ప్రజలకు తాగునీటి సరఫరా అంశాలపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఇటీవల అక్కడ జరిగిన దొంగతనం ఘటనపై కూడా మేయర్ చర్చించారు. ఆ ఘటన ఎలా జరిగిందో పూర్తిగా వివరాలు తెలుసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం అన్నారు.