చిత్రం న్యూస్,నర్సంపేట: ప్రభుత్వ గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం జనతా ట్రస్ట్ మిత్ర బృందం అండగా నిలిచింది. గ్రంథాలయంలో కనీస వసతులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ట్రస్ట్ ప్రతినిధులు, వారికి అవసరమైన టేబుల్స్, కుర్చీలు, వాటర్ డిస్పెన్సర్ను శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఈ సాయం చేసినట్లు తెలిపారు. ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా జనతా ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్, నకిరెడ్డి మహేందర్, ఐనవోలు శివరాంలతో పాటు గూడూరు సందీప్, రంజిత్, అంబేద్కర్, దయాకర్, విఘ్నేష్, విజయ్ సింగ్, నాగేంద్ర బాబు, రవీంద్ర చారి, రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.