చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది దాడి చేశారు. ఆయన మాట్లాడుతూ..పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్ఫోన్లు, రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.