Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 6:51 pm Editor : Chitram news

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల స్వర్గం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని  కోరుతూ గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ బస్ డిపో మేనేజర్ కు శివప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఆయా గ్రామాలలో బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి బస్సులు రాకపోవడం, కనీస సౌకర్యాలు లేని బస్టాండ్లు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం వల్ల నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కీర్గుల్ (కె ), ఓని, కౌట, సాలాపూర్, అనేక గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక, సకాలంలో నడవక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ సమస్యలపై రవాణా శాఖ, అధికారులు స్పందించి ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.